గుంటూరులో
పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ... గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు సిలిండర్ మోస్తూ... మోకాళ్లపై నడుస్తూ... నిరసన తెలిపారు. అనంతరం పెట్రోల్ బంక్ ఎదుట నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ , నిత్యావసర సరుకులు ధరలను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రజల రక్తాన్ని పన్నులు రూపంలో పీల్చుకుంటుదన్నారు.
తక్షణమే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలను నియంత్రించాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అన్నారు. తక్షణమే పెంచిన ధరలను నియంత్రించాలని కోరారు.