ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

COLOR CHANGE: అప్పుడు పసుపు రంగు.. ఇప్పుడు నీలం రంగు! - Color changes

రాష్ట్రంలో మనబడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా.. పాఠశాలల గోడల రంగులను మార్చుతున్నారు. తొలివిడతలో పసుపు రంగు వేయగా.. పాలక పక్షాల నుంచి అభ్యంతరం రావడంతో నీలం రంగులను అధికారులు వేయిస్తున్నారు.

Color changes on walls of schools at korni
పాఠశాలల రంగు మార్పు

By

Published : Jul 22, 2021, 10:18 AM IST

రాష్ట్రంలో మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తొలివిడతలో ఎంపిక చేసిన.. 28 పాఠశాలల్లో అధికారులు పనులు చేయించారు. విద్యార్థులను ఆకర్షించేలా గోడలపై రంగులు, బొమ్మలను వేయించారు. కానీ గోడలపై పసుపు రంగు వేయడంతో పాలక పక్షానికి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో.. కొర్ని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రంగులు మార్చారు. పసుపు రంగుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ...రంగును మార్చివేశారు. మిగిలిన పాఠశాలల్లోనూ నీలం రంగు వేయిస్తున్నామని ఆర్ వీఎం ఏఈ సురేష్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details