ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సర్వజన ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్​

By

Published : May 25, 2020, 4:37 PM IST

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ నివాస్, జేసీ సుమిత్ కుమార్, జీజీహెచ్ వైద్యులుతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. ఐసీయూ వార్డులు, ఐసోలేషన్ వార్డులు, వైద్యుల క్వారంటైన్ సౌకర్యాలు తదితర విభాగాల్లో మార్పులను సూచించారు.

collectore nivas visited district saroajani hospital
సర్వజన ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్​ నివాస్

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కొంత భాగాన్ని కోవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో కోవిడ్ వైద్య సదుపాయాలు పెంపొందించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జీజీహెచ్​లో కొన్ని బ్లాకులను కరోనా చికిత్సకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు.

ఈ మేరకు కలెక్టర్ నివాస్, జేసీ సుమిత్ కుమార్, జీజీహెచ్ వైద్యులు ఆసుపత్రిని పరిశీలించారు. కోవిడ్, కోవిడేతర వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గాలు, బయటకు వెళ్ళే మార్గాలు, ఐసీయూ వార్డులు, ఐసోలేషన్ వార్డులు, వైద్యుల క్వారంటైన్ సౌకర్యాలు తదితర విభాగాల్లో మార్పులపై సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details