ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పునరావాస కేంద్రాల్లోని వారికి కరోనా పరీక్షలు' - కలెక్టర్ జె .నివాస్

ఆమదాలవలసలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల్లో ఉండేవారికి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులని ఆదేశించారు.

srikakulam district
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : May 11, 2020, 6:51 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబాయి బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పది మందికి ఒక మరుగుదొడ్డి ఉండేలా చూడాలన్నారు.

విద్యుత్తు, త్రాగునీరు, భోజనం, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక అధికారి డాక్టర్ బి పద్మ, తహసీల్దార్ పూజారి రాంబాబు, ఎంపీడీవో వెంకట రాజు, కమిషనర్ రవి సుధాకర్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డీజే రవి బాబుతో పాటు అధికారులు ఉన్నారు.

ఇది చదవండిఇకపై రైలెక్కాలంటే ఇవి పాటించాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details