ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్​ కార్యాలయంలో ఫొని తుపాను నేపథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు తగు జాగ్రత్తలు అధికారులు వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By

Published : May 1, 2019, 6:58 AM IST

'తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ఫొని తుపాన్​ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్​ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, వీఆర్వోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి బి. రాజగోపాల్​ తెలిపారు. తుపాన్​ కారణంగా విద్యుత్​ సమాచార వ్యవస్థ తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున ముందస్తు రక్షిత పథకాలు, తాగు నీటి నిల్వలు ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తుపాన్​ కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తహసీల్దార్​ , ఎంపీడీవోలు తగు జాగ్రత్తలు, సలహాలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details