ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఔరా: 18 ఏళ్లు నిండనే లేదు అయినా ఓట్లేశారు..! - ap news time'

వాళ్లకింకా పద్దెనిమిదేళ్లు నిండలేదు..అయినా క్యూలో నిలబడి ఓట్లేశారు. వారిని ఏ అధికారి వారించ లేదు..పైగా సూచనలిస్తూ..దగ్గరుండి మరీ ఓటింగ్​ జరిపించారు. ఆ విశేషమేంటో తెల్సుకోవాలనుకుంటున్నారా..అయితే చదవండి మరీ...!

వీళ్లకు 18 ఏళ్లు నిండనే లేదు అయినా ఓట్లేశారు..!

By

Published : Aug 4, 2019, 11:09 AM IST

Updated : Aug 4, 2019, 11:38 AM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఓట్లేశారు. క్యూలో నిలబడి తమ నాయకుడిని ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సూచనలతో..ఎన్నికల​ను విజయవంతం చేశారు. ఏంటా అనుకుంటున్నారా..! వారి స్కూల్లో విద్యార్థి నాయుకులను ఎంచుకునే ప్రక్రియలో భాగమే..ఇదంతా. మూడు నుంచి ఎనిదిమిదో తరగతి పిల్లలంతా ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాలెట్​ పత్రాలతో ఓటు వేశారు. విద్యార్థి దశ నుంచే ఎన్నికల నిర్వహణపై ఓ అవగాహన రావడం కోసం... ఇలా చేశామని టీచర్లు వివరించారు.

వయోజనులు కాదు అయినా ..ఓట్లేశారు..!
Last Updated : Aug 4, 2019, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details