ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయి చేయి కలిపారు.. డ్యాం పనులు మొదలు పెట్టారు - check dam in srikakulam news

గత ఏడాది తుఫాను వచ్చి డొంకూరులో చెక్ డ్యాం కొట్టుకుపోయింది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదు. చివరికి రైతులే చేయి చేయి కలిపారు. డబ్బులు పోగుచేసుకున్నారు. డ్యాం పనులు మొదలుపెట్టారు.

check dam in srikakulam
check dam in srikakulam

By

Published : May 14, 2020, 8:25 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో రైతులంతా కలిసి రూ.5 లక్షలు పోగుచేసి చెక్ డ్యాం పనులను ప్రారంభించారు. గత ఏడాది వచ్చిన తుపానుకు డొంకూరులో ఉన్న చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఈ కారణంగా.. అన్నదాతలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది.

ఇంకో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డొంకూరు, బర్జపాడు, పెద్ద లక్ష్మీపురం, చిన్నలక్ష్మీపురం, శివ కృష్ణాపురం గ్రామానికి చెందిన అన్నదాతలు చేయి చేయి కలిపారు. ఐదు లక్షల నిధులు పోగు చేశారు. వీటితో చెక్ డ్యాం పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న ఐదు వందల ఎకరాల పంట పొలాలకు ఇది నీటిని అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details