ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 22, 2020, 6:18 PM IST

ETV Bharat / state

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేసిన యువ మోర్చా

కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో బీజేపీ యువ మోర్చా నాయకులు వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.

srikakulam district
పీపీఈ కిట్లను పంపిణి చేసిన యువ మోర్చా నాయకులు

శ్రీకాకుళం పట్టణంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు మనోజ్, జయంత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details