ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రప్రభుత్వ పాలనపై భాజపా కరపత్రాలు విడుదల

By

Published : Jun 15, 2020, 7:14 PM IST

ప్రధాని మోదీ ఏడాది పాలనపై శ్రీకాకుళం జిల్లా భాజపా నేత విష్ణుకుమార్‌రాజు కరపత్రాలను విడుదల చేశారు. దేశాన్ని అభివృద్ధిబాటలో నడిపేందుకు మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.

bjp leaders release pamplates  about one year ruling of bjp govt in central
bjp leaders release pamplates about one year ruling of bjp govt in central

భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని భాజపా నేత విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో భాజపా ప్రభుత్వ ఎడాది పాలన కరపత్రాలను విష్ణుకుమార్‌రాజు విడుదల చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఈ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. అనంతరం సూర్యమహల్‌ కూడలిలో నిర్వహించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details