ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంగమేశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

By

Published : Apr 13, 2021, 3:29 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర దేవాలయంలో సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. గేదెల హరికృష్ణ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

Psychic sculpture
సైకత శిల్పం

సంగమేశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

శ్రీకాకుళం జిల్లాలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సైకత శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర దేవాలయం కొండ దిగువ భాగాన... ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పాన్ని రూపొందించాడు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సైకత శిల్పం ద్వారా సూచించారు.

ABOUT THE AUTHOR

...view details