ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్దానంలో ఎలుగుబంట్ల హల్​చల్

By

Published : May 2, 2020, 11:41 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్​చల్ చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలోని తోటల్లో తిరుగుతూ వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి.

bears grooming in uddhanam srikakulam district
ఉద్దానంలో ఎలుగుబంట్ల హల్​చల్

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని కొబ్బరి, జీడిమామిడి తోటల్లో ఎలుగుబంట్లు హల్​చల్ చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి పరిధిలోని తోటల్లో కొద్ది రోజులుగా రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయ పనికోసం తోటకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఇవి తిరుగుతుండంతో మత్స్యకారులు భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details