ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొండలో కరోనాపై అవగాహన - పాలకొండలో కరోనాపై అవగాహన

వెలుగు మహిళలంతా కరోనాపై అవగాహన కల్పించాలని నడుం బిగించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు.

awarness programme on corona virus at palakonda in srikakulam district
awarness programme on corona virus at palakonda in srikakulam district

By

Published : Mar 17, 2020, 4:11 PM IST

పాలకొండలో కరోనాపై అవగాహన

కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెలుగు ప్రాంతీయ సమన్వయ కర్త నాగమణి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో.. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అరికట్టవచ్చంటూ ర్యాలీ చేపట్టారు. జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో సంచరించవద్దని.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details