ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీసీ రోడ్డుకి శాసన సభాపతి శంకుస్థాపన - స్పీకర్ తమ్మినేని తోడవాడ కొమ్మువలసలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

రాష్ట్రంలో పల్లెల అభివృద్ధికి సీఎం జగన్ చొరవ తీసుకుంటున్నారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ కొమ్మువలసలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

speaker tammineni foundation stone to cc road at thotavada kommuvalasa
తోటవాడ కొమ్మువలసలో సీసీ రోడ్డుకి శాసనసభాపతి శంకుస్థాపన

By

Published : Mar 24, 2021, 5:31 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ కొమ్మువలసలో సీసీ రోడ్డు నిర్మాణానికి శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికి, సీఎం జగన్​కే దక్కుతుందన్నారు.

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని పల్లెలనూ అభివృద్ధి చేసేందుకు సీఎం చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు, అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details