శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో సభాపతి తమ్మినేని సీతారాం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైదాం ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమావేశం నిర్వహించిన ఆయన.. అనంతరం ప్రభుత్వ స్థలాలపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై సరిగా సమాధానం ఇవ్వని మండల సర్వేయర్పై మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై మండిపడ్డ తమ్మినేని.. పనితీరు మార్చుకోవాలని అధికారులకు సూచించారు.
సర్వేయర్పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..? - అధికారులపై సభాపతి తమ్మినేని ఆగ్రహం వార్తలు
ప్రభుత్వ స్థలాల విషయంలో సరిగా స్పందించని అధికారులపై సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో సర్వేయర్పై మండిపడ్డారు.
![సర్వేయర్పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..? సర్వేయర్పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7504515-346-7504515-1591445693995.jpg)
సర్వేయర్పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?
అధికారులపై స్పీకర్ ఆగ్రహం