ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవాగ్జిన్ టీకా కోసం బారులు తీరిన జనం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లాకు చాలా రోజుల తర్వాత కోవాగ్సిన్ టీకా చేరుకుంది. రెండో డోసు తీసుకోవాల్సిన గడువు చాలా మందికి ముగిసిన కారణంగా.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు టీకా కోసం క్యూకట్టారు.

COVAXIN
COVAXIN

By

Published : May 8, 2021, 5:17 PM IST

చాలా రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కోవాగ్జిన్ టీకా వేశారు. విషయం తెలిసి.. చాలామంది కేంద్రాలకు తరలివెళ్లారు. కొందరు ఉదయం 8 గంటలకే వచ్చి క్యూ లైన్లలో నిల్చున్నారు.

అన్ని కోవాగ్జిన్ టీకా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంలో 19 వేల మందికి టీకా వేయాల్సి ఉండగా కేవలం 5 వేల డోసులు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ 2వ డోసు పూర్తయ్యాకే.. మొదటి డోసు వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details