ప్రస్తుత వైకాపా అరాచకాలకు తెదేపా నాయకులు ఊర్లు వదిలే పరిస్థితి ఉందని అయితే జిల్లాలో ఎస్పీపరిపాలన బాగుందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో లేనిపోని ఆరోపణలతో తనపై పెట్టిన కేసుల కొట్టి వేసే విషయంలో స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని అందుకోసమే ఎస్పీని కలిశానని చెప్పారు.తాము ఏ పార్టీ లోకి చేరడం లేదని తేదేపా లోనే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.