ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా ముందుకు రండి' - minister alla nani orederd officers in srikakulam on corona prevention

శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడంపై మంత్రి ఆళ్ల నాని విచారం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిక్కోలు కలెక్టర్​ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

'కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా ముందుకు రండి'
'కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా ముందుకు రండి'

By

Published : Apr 26, 2020, 12:53 PM IST

Updated : Apr 26, 2020, 6:17 PM IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న మంత్రి ఆళ్లనాని

ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో సభాపతి తమ్మినేని, మంత్రి ధర్మానతో కలిసి కరోనాపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులపై స్పందించిన ఆయన.. దురదృష్టవశాత్తు సిక్కోలుకు కూడా కరోనా సోకిందన్నారు. సీఎం జగన్​.. జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కాల్​సెంటర్​ ఏర్పాటుతో పాటు టోల్​ఫ్రీ నెంబరు జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఆందోళన వద్దు

శ్రీకాకుళం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,576 నెగిటివ్‌గా వచ్చాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. 1,445 మంది విదేశాల నుంచి వచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలను జిల్లా అధికారులకు వివరించానన్న ఆయన.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

అధికారులూ.. తీసుకోండి కఠిన నిర్ణయాలు: సభాపతి తమ్మినేని

Last Updated : Apr 26, 2020, 6:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details