ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి' - ప్రభుత్వపై అచ్చెన్నాయుడు మండిపాటు

వైకాపా ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ..స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

By

Published : Jan 23, 2021, 10:55 PM IST

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ..స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆక్షేపించారు. పంచాయతీ రాజ్ చట్టానికి తూట్లు పొడుస్తూ..ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి లోబడి ఉన్న సంస్థ అని.. దానిని ఒక పార్టీకి ఆపాదించటం సరికాదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలన్నారు.

దేవాలయాలపై దాడులకు సీఎందే బాధ్యత

దేవాలయాలపై జరిగే దాడులను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని అచ్చెన్న మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో రెండో అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసమైనా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. దీనికి కారకులైన విజయసాయిరెడ్డి, పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు !

ABOUT THE AUTHOR

...view details