ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అచ్చెన్న అవినీతి చేయలేదని తెలిసినా అరెస్ట్ చేశారు'

By

Published : Aug 20, 2020, 3:58 PM IST

ఈఎస్​ఐ వ్యవహారంలో తెదేపా నేత అచ్చెన్న అవినీతి చేయలేదని తెలిసినా కూడా అరెస్టు చేయడం ఘోరమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆయన కేవలం ఓ లేఖ మాత్రమే ఇచ్చారని అధికారులే ఒప్పుకున్నారని ట్వీట్ చేశారు.

nara lokesh
nara lokesh

ఈఎస్​ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదని తెలిసి కూడా అరెస్టు చేయడం ఘోరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కేవలం తెలంగాణాలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయండి అని లేఖ రాసినందుకు అరెస్ట్ చేశామని అధికారులే ఒప్పుకున్నారని విమర్శించారు.

ఈఎస్​ఐ కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో తేలలేదని ఏసీబీ చెప్పినట్లు ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details