ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2020, 6:34 PM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

శ్రీకాకుళం జిల్లా వేరుగట్టు మండలం కుమ్మరికుంట గ్రామంలో బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు వెళ్లినప్పుడు విద్యుత్​ తీగలు తగిలి ప్రమాదం జరిగింది.

old photo
బాలుడి పాతచిత్రం

శ్రీకాకుళం జిల్లా వేరుగట్టు మండలం కుమ్మరికుంట గ్రామంలో విద్యుదాఘాతంతో పన్నేండేళ్ల బాలుడు మరణించాడు. ఖాళీగా ఉన్న పూరి గుడిసెలోకి ఆడుకునేందుకు వెళ్లి అక్కడే తెగిపడి ఉన్న కరెంట్​ తీగలను తాకగా.. ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని కాపాడేందుకు యత్నించి తండ్రి గాయాలపాలయ్యాడు.

విషయం గమనించిన గ్రామస్థులు కర్రలతో వీరిని తప్పించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details