ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద రూ.80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత - onions latest updates in ap

సరైన పత్రాలు లేకుండా కర్నూలు, మహరాష్ట్ర నుంచి ఒడిశాకు ఉల్లిపాయలతో వెళ్తున్న మూడు లారీలను విజిలెన్స్​ అధికారులు ఇచ్ఛాపురం వద్ద పట్టుకున్నారు.

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత
ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత

By

Published : Dec 6, 2019, 9:48 PM IST

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో సరైన పత్రాలు లేకుండా ఒడిశాకు వెళ్తున్న మూడు లారీలను అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​, మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వీటి విలువ 80 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్​లో తరలిస్తున్న ఉల్లిపాయలపై అధికారులు నిఘా పెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం లోద్దపుట్టి జంక్షన్​ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు లారీలను... మహారాష్ట్ర నుంచి ఒడిశాకు వెళ్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details