ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి - వినాయక నవరాత్రి ఉత్సవాలు

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని 2 మండలాల్లో... విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి

By

Published : Sep 12, 2019, 8:16 PM IST

Updated : Sep 12, 2019, 8:50 PM IST

విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. నరసన్నపేట పట్టణంలోని ఉణ్ణవారి వీధిలో విద్యుదాఘాతానికి గురై అలిగి హేమంత్ కుమార్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో.. విద్యుత్ దీపాలు తొలగిస్తుండగా.. ప్రమాదం జరిగింది. కరెంటు ఎర్త్ అవుతోందని వెదురు కర్రల పక్కన విద్యుత్ తీగలను ఉంచామని మెకానిక్ తెలిపారు. ఇది తెలియక హేమంత్ కుమార్ ఆ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

సారవకోటలో...

సారవకోట మండలం బుడితిలో ధర్మాన రాంబాబు అనే వ్యక్తి మృతి చెందారు. ట్రాక్టర్​పై వినాయక నిమజ్జనానికి వెళుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ప్రాణం విడిచారు.

ఇదీ చూడండి:

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

Last Updated : Sep 12, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details