ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజా సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం'

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కారంచేడులో పాదయాత్ర చేపట్టారు.

By

Published : Nov 15, 2020, 10:55 PM IST

'ప్రజా సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం'
'ప్రజా సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం'

ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి రావి రామనాధంబాబు, వైకాపా నాయకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. కారంచేడు వంతెన సెంటర్​లో ఉన్న వైఎస్ఆర్​ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బీసీల అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని జంగా కృష్ణమూర్తి చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details