ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరులో వైకాపా కార్యకర్తలు వేడుకలు - ycp one year celebrations

వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో ఆ పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి.వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి..వృద్ధులు,పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

పర్చూరులో వైకాపా కార్యకర్తలు వేడుకలు
పర్చూరులో వైకాపా కార్యకర్తలు వేడుకలు

By

Published : May 23, 2020, 7:36 PM IST

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథం బాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పర్చూరు వైకాపా కార్యాలయం, వృద్దాశ్రమాల్లో పేదలకు, వృద్దులకు పండ్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా రావి రామనాథం బాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టిన అనతికాలంలోనే ప్రజల్లో పేరుతెచ్చుకున్నారన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details