ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఆదిమూలపు సురేశ్​

By

Published : Apr 3, 2021, 8:46 PM IST

ఈనెల 8న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యర్రగొండపాలెం జడ్పీటీసీ అభ్యర్థి విజయభాస్కర్​ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మాట్లాడుతున్న మంత్రి సురేశ్
మాట్లాడుతున్న మంత్రి సురేశ్

ఏకగ్రీవాలు మినహా... మిగిలిన చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి సురేశ్ సుడిగాలి పర్యటన చేశారు. ఈనెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. యర్రగొండపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యర్రగొండపాలెం జడ్పీటీసీ అభ్యర్థి విజయభాస్కర్​ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details