మట్టి పెళ్లలు మీదపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సింగన్న పాలెంలో జరిగింది. తాళ్లూరు మండలంలోని నాగంబోట్లపాలేనికి చెందిన కొందరు కూలీలు స్థానిక వాగులో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతుండగా పెళ్లలు కూలాయి. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన లక్ష్మిని చికిత్స కోసం లక్ష్మిని చీమకుర్తికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
సింగన్నపాలెంలో మట్టి పెళ్లలు పడి ఓ మహిళ మృతి - సింగన్నపాలెంలో నేర వార్తలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సింగన్న పాలెం వద్ద మట్టి పెళ్లలు మీదపడి ఓ మహిళ మృతిచెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
సింగన్నపాలెంలో ఇటుకపెళ్లలు మీదపడి ఓ మహిళ మృతి
Last Updated : Jul 22, 2020, 3:39 PM IST