ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పరీక్షలకు వచ్చి స్పృహ తప్పిన మహిళా కండక్టర్ - స్బృతప్పి పడిపోయిన మహిళా కండక్టర్

ప్రకాశం జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కనిగిరిలో కరోనా పరీక్షల నిమిత్తం సంజీవిని బస్సును ఏర్పాటు చేశారు. అయితే 3 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళా కండక్టర్... పరీక్షల కోసం బస్సు వద్దకు వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

women conductor fell down with giddiness in kanigiri at prakasam district
కరోనా పరీక్షలకు వచ్చి స్బృతప్పి పడిపోయిన మహిళా కండక్టర్

By

Published : Aug 18, 2020, 5:46 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కనిగిరిలో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవని బస్సు వద్దకు వచ్చిన ఆర్టీసీ మహిళా కండక్టర్ మల్లీశ్వరి స్పృహ తప్పి పడిపోయింది.

మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా కరోనా పరీక్షల నిమిత్తం సంజీవని బస్సు దగ్గరకు వచ్చిన మల్లేశ్వరి ఒక్క సారిగా సృహ తప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన అక్కడి వైద్య సిబ్బంది, ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details