ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఇంట్లో ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగింది? - భర్త మృతితో భార్య ఆత్మహత్య న్యూస్

ప్రకాశం జిల్లాలో భార్యభర్తల మృతి... మిస్టరీగా మారింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. తిరిగిరాని లోకాలకు వెళ్లింది. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందారు. భర్త అనుమానస్పద స్థితిలో మృతి చెందాడని తెలిసి.. భర్య ఆత్మహత్య చేసుకుంది.

wife and husband death
wife and husband death

By

Published : Apr 14, 2021, 3:47 PM IST

Updated : Apr 14, 2021, 5:00 PM IST

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో భర్త అనుమానస్పదంగా మృతి చెందగా, ఈ విషయం తెలియగానే భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలుకు చెందిన నాగరాజు, శ్రీ వల్లి నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైన కారణంగా.. పెద్దలు వ్యతిరేకించారు. అయినా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఒంగోలు లోనే కాపురం పెట్టారు. పిల్లలు లేరు. అయితే.. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. తనను వేధిస్తున్నాదంటూ నాగరాజుపై ఇప్పటికే... ఒంగోలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో శ్రీవల్లి కేసు పెట్టి ఉంది.

మరోవైపు.. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు ఈ రోజు ఉదయం టంగుటూరు మండలం మర్లపాడులో నీటి కుంటలో శవమై తేలాడు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నీటి కుంట నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా, మృతుడి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఈ విషయమై... టంగుటూరు పోలీసులు ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతుడు నాగరాజు ఇంటికి వెళ్లిన పోలీసులు... అతని భార్య శ్రీవల్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించడంపై అవాక్కయ్యారు. ఈ రెండు మరణాలు.. అనుమానాన్ని రేకిత్తిస్తున్నాయి. ఈ సంఘటనల వెనక కారణాలు ఏంటనే విషయంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసుపై లోకేశ్‌ ప్రమాణాల హడావుడి చేశారు: కన్నబాబు

Last Updated : Apr 14, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details