ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవనం పైనుంచి పడి.. వార్డు వాలంటీర్ మృతి! - భవనం పైనుంచి పడి వార్డు వాలంటీర్ మృతి

ప్రకాశం జిల్లా అద్దంకిలో.. 5 అంతస్తుల భవనంపైనుంచి పడి వార్డు వాలంటీర్ షేక్ షాజహాన్ చనిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ward Volunteer suspected death

By

Published : Nov 13, 2019, 7:21 PM IST

భవనం పైనుంచి పడి.. వార్డు వాలంటీర్ మృతి

ప్రకాశం జిల్లా అద్దంకిలో వార్డు వాలంటీర్ అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 అంతస్తులు ఉన్న వీఎన్ఎస్ టవర్స్​పై నుంచి కిందపడి.. షేక్ షాజహాన్ అనే వ్యక్తి మరణించాడు. ఇతను పట్టణంలోని 17వ వార్డు వాలంటీర్​గా పని చేశాడు. నాలుగో వార్డు పరిధిలోని ఈ భవనంలో.. షాజహాన్ ఇలా చనిపోయి ఉండడంపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ ఇదే భవనం వద్ద ఇలాగే ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. షాజహాన్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details