ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TEACHERS PROTEST : జీవో 172 రద్దు కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు - UTF protest in chirala

జీవో నెం 172ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ఈ జీవోతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాథమిక విద్య (primary education)కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3, 4, 5 తరగతులను వేరుచేసి ప్రాథమికోన్నత (upper primary), ఉన్నత పాఠశాలల (high school)కు తరలిస్తే మొత్తం ప్రాథమిక వ్యవస్థ (primary education) నిర్వీర్యం అవుతుందని వాపోయారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు

By

Published : Jul 15, 2021, 7:27 PM IST

ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 172 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గ్రామీణ మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ జీవో అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

  • ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, జీవో 172ను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ... విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆందోళన నిర్వహించారు. ఈ జీవోతో ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రాథమిక విద్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • 'మా బడి - మా ఊర్లోనే ఉంచండి' అని పార్వతీపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు.
  • నూతన జాతీయ విద్యావిధానం అమలుకు జారీ చేసిన జీవో 172 రద్దు చేయాలని.. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను మానుకోవాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 ద్వారా ప్రాథమిక విద్య... మాతృభాషలోనే బోధించాల్సిన సూచనకు విరుద్ధంగా ఉంటుందని యూటీఎఫ్ నాయకులు అన్నారు.
  • గుంటూరు జిల్లా తెనాలిలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు... అంగన్​వాడీలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details