ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. లారీని అప్పగించేందుకు వెళ్తుండగా ఒకరు, ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరొకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

By

Published : Jan 25, 2020, 6:55 PM IST

two died in ventapuram highway accident
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

కొత్త లారీని అప్పగించేందుకు వెళ్తుండగా...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. చెన్నై నుంచి ఒడిశాకు కొత్త లారీని డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా వెంకటాపురం వద్ద డివైడర్​ను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా...
ప్రకాశం జిల్లా ముప్పవరం రహదారిపై లారీని ఢీకొని యువకుడు మృతిచెందాడు. మృతుడు బల్లికురవ మండలం నక్కబొక్కలపాడుకు చెందిన ఒంగోల్ సురేష్​గా గుర్తించారు. 2 ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ జాతీయ రహదారి సమీపంలో అత్యవసర విమాన ల్యాండింగ్​కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రహదారిని తాత్కాలికంగా వన్​వేగా మార్చినా... ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details