అతివేగం వల్ల ఒకరి మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో 16వ నెంబర్ జాతీయరహదారిపై జరిగింది. విజయవాడ నుంచి ఒంగోలు వైపునకు అతి వేగంగా వెళుతున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రోడ్డుపై ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ రవి అక్కడికక్కడే మృతిచెందాడు. గుత్తేదారుల వద్ద రహదారి పనులు చేస్తున్న ఆరుగురు బిహార్ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రేణంగివరం పోలీసులు వారిని 108 వాహనంలొ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ...
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు.