ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి దండుదొవ దగ్గర ఉన్న ఉద్యానపంటలు, సాగు విధానాలను ఉద్యాన అధికారులతో కలిసి శిక్షణ ఐఏఎస్ పరిశీలించారు. దందా వీరాంజనేయులు క్షేత్రంలో సాగవుతున్న భిన్నరకాల పంటలు, సాగు విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఉద్యానసాగుకు పెద్దపీటవేస్తూ... సాగురైతులకు భారీగా రాయితీ పథకాలను అందిస్తోందని శిక్షణ ఐఏఎస్ అధికారి అభిషేక్ తెలిపారు. మిరప, కూరగాయలను నాటే ఆటోమేటిక్ యంత్రాన్ని, పచ్చ అట్టలు తయారీ పరిశ్రమ, కూరగాయలను భద్రపరచే మినీ సోలార్ శీతలగోదాము, ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఏర్పాటుచేసిన షెడ్నెట్లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన ఏడీ నాగరాజు, ఏపీడీ జనమ్మ, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగును పరిశీలించిన శిక్షణ ఐఏఎస్ - etv bharat latest updates
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి సమీపంలోని ఉద్యానపంటల సాగు విధానాలను ఉద్యాన అధికారులతో కలిసి శిక్షణ ఐఏఎస్ అధికారి అభిషేక్ పరిశీలించారు. పంటలసాగుకు ఉపయోగించే వివిధ రకాల ఆటోమేటెడ్ యంత్రాల వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
![ఉద్యాన పంటల సాగును పరిశీలించిన శిక్షణ ఐఏఎస్ Training IAS examining the cultivation of horticultural crops at prakasam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8016085-106-8016085-1594695729762.jpg)
ఉద్యాన పంటల సాగును పరిశీలించిన శిక్షణ ఐఏఎస్