ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 9:13 AM IST

ETV Bharat / state

మార్కాపురంలో 3 రోజులపాటు పూర్తి లాక్ డౌన్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం నుంచి 3 రోజులపాటు పూర్తి లాక్​డౌన్ విధించారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సరకులు ఇంటికే తెచ్చిస్తామని.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

three days complete lockdown in markapuram prakasam district
మార్కాపురంలో 3 రోజులపాటు పూర్తి లాక్ డౌన్

కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికారులు పూర్తి లాక్​డౌన్ విధించారు. ఇప్పటివరకూ 96 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. 10 రోజుల వ్యవధిలో వైరస్​తో నలుగురు మృతిచెందారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఇంటికే తెచ్చి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details