ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2020, 10:39 PM IST

ETV Bharat / state

విషాదం: తాగకపోతే తలనొప్పి...దొరకలేదని శానిటైజర్ తాగితే...!

చుక్క పడకపోతే తలనొప్పి... అంతేనా ఒళ్ళంతా వణికిపోతుంది. తాగాలన్న ఆరాటం.. మరోవైపు మతిపోయే ధరలు. ఎలాగోలా డబ్బులు సంపాదించినా....లాక్ డౌన్​ కారణంగా దుకాణాలు తెరవకపోవటం. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏదో ఒకటి చేసి గొంతులో మత్తు దింపాలనుకొని ప్రాణాల మీదకు తెచుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. మత్తు కోసం శానిటైజర్లు సేవించటంతో... ఒక్కరు కాదు ఇద్దరూ కాదు జిల్లా వ్యాప్తంగా.. ఏకంగా 13 మంది మృత్యువాత పడ్డారు.

thirteen-die-after-drinking-sanitizer
thirteen-die-after-drinking-sanitizer

వాళ్లంతా మద్యం మహమ్మారికి బానిసలైన నిరుపేదలు.. పగలంతా కష్టపడి రాత్రయ్యేసరికి మద్యం తాగడానికి అలవాటు పడిన వాళ్లు. సమయానికి మద్యం తీసుకోకపోతే.. తలనొప్పి, ఒళ్ళంతా వణుకు వస్తుందని... అందుకు ఎక్కడ మద్యం ఉన్నా తాగాల్సిందేననని భావించేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో శానిటైజర్లు తాగి 13 మంది పిట్టల్లా రాలిపోయారు. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది.

ధరల మంట...అందులో లాక్ డౌన్

అసలే రాష్ట్రంలో మద్యం ధరలు మండుతున్నాయి. దీనికితోడు లాక్ డౌన్ విధింపుతో మద్యం కరవైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు శానిటైజర్లలో ఆల్కహల్ ఉంటందనే విషయాన్ని తెలుసుకున్నారు. ధర చూస్తే తక్కువే... ఇంకేముంది..అంతో ఇంతో పెట్టి కొనుగోలు చేయటం...వాటిలో నీళ్లను కలుపుకుని తాగటం మొదలుపెట్టారు. గత రెండు మూడు వారాలుగా జిల్లాలోని కురిచేడు గ్రామానికి చెందిన పలువురు ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత గ్రామంలో ఉండే ఇద్దరు యాచకులు చనిపోగా...తరువాత 8 మంది మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.

గురువారం కురిచేడు గ్రామంలో ఇద్దరు మృతి చెందగా సాధారణ మరణాలుగా భావించి వారిని ఖననం చేశారు. అయితే వారు కూడా ఇలా శానిటైజర్లు సేవించడం వల్లనే మృతి చెందారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రాణం విడిచే ముందు తీవ్రమైన తలనొప్పి, కడుపులో నొప్పి, వాంతులు వచ్చి చనిపోయారని బంధువులు పేర్కొన్నారు.

మరో ఘటనలో ముగ్గురు

కురిచేడులో ఘటన తరహాలోనే జిల్లాలోని పామూరులోనూ మరో ఘటన జరిగింది. మందు దొరక్క శానిటైజర్​ తాగి ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మొత్తం 13 మంది మృతి చెందారు.

శానిటైజర్లు సేవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవటంపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఘటనపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ... మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. వీరందరూ ఒకేసారి ఎలా మృతి చెందారు?..శానిటైజర్లు ఎక్కడ కొన్నారు?.. వాటిల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

మద్యం దొరక్క శానిటైజర్​ సేవించి 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details