ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఈ నెల పదమూడో తేదీన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను స్థానిక ఎస్సై శివ నాంచారయ్య అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశామని దర్శి డీఎస్పీ ప్రకాశ్రావు తెలిపారు. నిందితులను తాడేపల్లి మండల వాసులుగా గుర్తించారు. వీరిపై గతంలో ఆయా పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 51 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దొంగలు అరెస్టు.. 51గ్రాముల బంగారం స్వాధీనం - darshi dsp prakashrao
ప్రకాశం జిల్లాలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![దొంగలు అరెస్టు.. 51గ్రాముల బంగారం స్వాధీనం thieves-arrest-in-prakasam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6237486-222-6237486-1582897367833.jpg)
దొంగతనానికి పాల్పడిన నిందితుల అరెస్టు
Last Updated : Feb 28, 2020, 7:28 PM IST