ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 4:15 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ.. 4 లక్షల సొత్తు అపహరణ

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మర్రిపూడి మండలం జగ్గరాజు పాలెంలో జరిగింది. గోడ బద్ధలు కొట్టి రూ.2 లక్షల నగదు, లక్షన్నర విలువచేసే సరుకును దుండగులు ఎత్తుకెళ్లారు.

Theft in government liquor store
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. రూ.2లక్షల నగదు, లక్షన్నర విలువ చేసే మద్యం బాటిళ్లతో పాటు స్కానర్ యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details