ప్రయాణికుల బ్యాగులను కత్తిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా(prakasam district) పోలీసులు అరెస్టు (theft gang arrest)చేశారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్లో చోరీ
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంకొల్లు ఫార్మసి కళాశాలలో పనిచేస్తున్న కళా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లేందుకు చీరాల నుంచి గుంటూరు వెళ్లే బస్సు ఎక్కారు. బస్సు రద్దీగా ఉండటంతో వీరితో బస్సు ఎక్కిన మరో ఇద్దరు మహిళలు కళా ప్రవీణ్కు చెందిన బ్యాగ్ను కత్తిరించి .. 300 గ్రాముల బంగారాన్ని(gold theft) ఎత్తుకెళ్లారు. అనంతరం బ్యాగు చూసుకున్న బాధితులు చీరాల రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.