ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 18, 2020, 4:50 PM IST

ETV Bharat / state

అనుమానంతో గొంతు నులిమి చంపేసిన భర్త

భార్యపై అనుమానం.. భర్తను హంతకుడిని చేసింది. గృహిణి ప్రాణం బలైంది.

The husband killed his wife at Bayanapalle in prakasham
The husband killed his wife at Bayanapalle in prakasham

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బయనపల్లె గ్రామంలో భార్యను.. అనుమానంతో హత్య చేశాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగట్ల శకుంతల, శివరంగయ్య దంపతులు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శివరంగయ్య.... ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతు నులిమాడు. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details