Telugu Woman Spoke to Prime Minister Modi :ప్రకాశం జిల్లా కనిగిరి మండలం భూతంవారిపల్లికి చెందిన కొమ్మలపాటి వెంకటరమణమ్మ ఎంఏ బీఎడ్ పూర్తిచేశారు. తల్లి దండ్రులు, అత్తామామలు పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాలు కావడంతో ఆమె కూడా ఈ రంగంపై మక్కువ పెంచుకున్నారు. సాగులో ఆమెకున్న ఆసక్తిని గమనించిన భర్త కొమ్మలపాటి వెంకటరావు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఆమెకు వివరిస్తుండేవారు. ఇది ఆమె ఆలోచనల్ని ఎంతగానో ప్రభావితం చేసింది.
మిద్దె పైనే మినీవనం.. చూడ్డానికీ రెండుకళ్లూ సరిపోవు.. ఎక్కడో తెలుసా!
Telugu Woman Used Technology in Cultivation : పాత విధానాలు విడనాడి తమకున్న అయిదు ఎకరాల భూమిలో డ్రోన్ల వినియోగంతో ఆధునిక సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆమె భావించారు. అనుకున్నదే తడవు స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ కళాక్షేత్రానికి వెళ్లి శిక్షణ తీసుకున్నారు. డ్రోన్ ద్వారా సాగుపై రెండు వారాల పాటు శిక్షణ పొందారు. ఏఏ పంటలు ఎలా సాగు చేయవచ్చు, డ్రోన్ వినియోగంతో వచ్చే ప్రయోజనాలు వంటివి పూర్తిగా తెలుసుకున్నారు.
Woman Spraying Fertilizers on Crops With Drones : వెంకటరమణమ్మ స్వయం సహాయక సంఘ గ్రూపు సభ్యురాలు కావడం, ఆధునిక సాగు విధానాల్లో ప్రవేశం ఉండటంతో ఆమె వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాలు పంచుకునే అవకాశం దక్కించుకున్నారు. నవంబరు 30న సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన వికసిత్ యాత్రలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వెంకటరమణమ్మ కూడా పాల్గొన్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీతో వర్చువల్గా మాట్లాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గానూ దేశవ్యాప్తంగా అయిదు గ్రామాలను ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి వెంకటరమణమ్మ ఎంపికై తన ప్రతిభ చాటారు.