ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మేము చనిపోయినా పట్టించుకునేవారు లేరు'

By

Published : May 30, 2020, 7:10 PM IST

ఉపాధి కోసం తమిళనాడుకు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన కూలీలు లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండేందుకు సరైన సదుపాయాలు లేక కష్టాలు పడుతున్నారు. అధికారులు తమను పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.

Sugarcane farming labors from Andhra struck in tamilnadu
Sugarcane farming labors from Andhra struck in tamilnadu

వలస కూలీల ఆవేదన

ప్రకాశం జిల్లాకు చెందిన 21 మంది వలస కూలీలు తమిళనాడులో అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి, ఉండడానికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 200 మంది వలస కూలీలు తమిళనాడు పుదుకొట్టై జిల్లా అరంగతంగిలోని ఓ చక్కెర కర్మాగారంలో పని చేసేందుకు వెళ్లారు. వీరిలో చాలామంది ఒక నెలలోపు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 21 మంది మాత్రం పనికోసం అక్కడే ఉన్నారు. మార్చి చివర్లో లాక్​డౌన్ విధించటంతో చిక్కుకుపోయారు.

వారందరూ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు తమకు ఏ మాత్రం సాయం అందించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చనిపోయిన పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఈటీవీ భారత్​ ప్రతినిధి పుదుకొట్టై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా... కొన్ని రోజుల్లో వారందరినీ స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details