ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత సైన్యానికి విద్యార్థుల ప్రశంస

పాక్ ఉగ్రమూకలపై భారత సైన్యం జరిపిన వైమానిక దాడులకు మద్దతుగా మార్కాపురంలో విద్యార్థులు అభినందన ర్యాలీ చేశారు. 'భారత సైన్యం శభాష్' అంటూ నినదించారు.

By

Published : Feb 26, 2019, 9:07 PM IST

మార్కాపురం

భారత సైన్యం దాడులకు మద్దతుగా విద్యార్థుల ప్రదర్శన

పాక్ ఉగ్రమూకలపై భారత సైన్యం జరిపిన వైమానిక దాడులకు మద్దతుగా ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. పాక్ ఉగ్రవాదులకు ఇది ఆరంభ చర్య మాత్రమేనని హెచ్చరించారు. 'భారత సైన్యం శభాష్', 'భారత మాతాకీజై ', 'వందేమాతరం' అంటూ నినాదాలు చేశారు. గడియార స్తంభం కూడలిలో ర్యాలీ చేశారు. విజయానికి ప్రతీకగా బాణాసంచా కాల్చారు.

ABOUT THE AUTHOR

...view details