ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు

By

Published : May 26, 2020, 10:14 PM IST

గిద్దలూరు ప్రాంతంలోని తండాలో పోలీసులు నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

praksam district
బెల్లపు ఊట ధ్వంసం చేసిన పోలీసులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలతో పోలీసులు నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ దాడులలో గిద్దలూరు సివిల్ పోలీసులు,స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు, ఎక్సైజ్ సీఐ సోమయ్య, ఎస్సై రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details