ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్షమాపణలు కోరిన ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్

By

Published : Mar 28, 2020, 8:20 PM IST

Updated : Mar 29, 2020, 11:19 AM IST

కుమారుడితో బైకుపై వెళ్తున్న వ్యక్తిని.. పోలీసులు చితకబాదడంపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పందించారు. బాధితులకు క్షమాపణ చెప్పి.. మాస్కులు ఇచ్చి పంపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని సూచించారు.

SP Siddhartha Kaushal has apologized to the victims of the kottapatnam incident
SP Siddhartha Kaushal has apologized to the victims of the kottapatnam incident

క్షమాపణలు కోరిన ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో.. కుమారుడితో కలిసి వెళ్తున్న వ్యక్తితో పోలీసులు స్పందించిన తీరుపై.. ఆ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. తన కార్యాలయానికి పిలిచి పోలీసుల తరఫున క్షమాపణలు కోరారు. ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏం జరిగిందంటే..

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలీసులు

కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పురిణి రాంబాబు.. అతని కుమారుడితో కలిసి రెండు రోజుల క్రితం ఒంగోలులోని ఆసుపత్రికి వెళ్లారు. బైక్​పై తిరిగి వస్తున్న సమయంలో వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాక్​డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని, మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. కొత్తపట్నం ఎస్​ఐ శ్రీనివాసరావు.. వారితో కఠినంగా శిక్షించారు. లాఠీతో కొట్టారు. చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది.

వెంటనే స్పందించిన ఎస్పీ కౌశల్.. బాధితులను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పోలీసుల తరఫున క్షమాపణలు కోరారు. ఘటనపై ఒంగోలు టౌన్ డీఎస్పీతో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి కరోనాపై అవగాహన కల్పించారు. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. జిల్లాలోని పోలీసులు సహనం కోల్పోయి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'భారత సంప్రదాయ వైద్యంతో కరోనాకు చెక్​ పెట్టండి'

Last Updated : Mar 29, 2020, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details