ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉన్నత విద్య.. ఆపై వ్యవసాయంలోనూ అక్కాచెల్లెళ్లు భళా! - prakasham district news

ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినా... ఉన్నత విద్యను అభ్యసించారు. వ్యవసాయంపై ఆసక్తితో ఆ తోబుట్టువులు సాగుబాట పట్టారు. ఆరోగ్యకరమైన పంటలు పండించాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. భూములు కొనుగోలు చేసి... సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

sister gain profits in agriculture after high educatation
sister gain profits in agriculture after high educatation

By

Published : Aug 8, 2021, 11:28 AM IST

ఉన్నత విద్య.. ఆపై వ్యవసాయంలో లాభర్జన... అక్కాచెల్లెళ్లు భళా!

ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మీ సుజాత, విజయలక్ష్మి అక్కాచెల్లెళ్లు. సుజాత ఎమ్​ఏ బీఈడీ చేసి.... హైదరాబాద్‌లో ప్రైవేట్‌ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విజయలక్ష్మి మాత్రం నాగులప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో నివాసముంటున్నారు. ఆమె భర్త రైతు కావడంతో ఆయనకు సహకరిస్తూ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నారు. సుజాత ఉన్నత చదువులు చదివినా సాగుపై మక్కువతో సొంతూరు వచ్చి వ్యవసాయం చేయాలని భావించారు. ఏడేళ్ల క్రితం ఇళ్లపావులూరు, జి.గుడిపాడు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. ఇళ్లపావులూరులో కొండకు దిగువున ఉన్నవన్నీ బీడు భూములే. రాళ్లు రప్పలతో సాగుకు ఏమాత్రం పనికిరాకుండా ఉండేవి. ఈ సోదరీమణుల చొరవతో.... అలాంటి భూములు ఇప్పుడు పండ్ల తోటలతో పచ్చగా కళకళలాడుతున్నాయి.

బీడు భూమిని చదును చేసి దానిమ్మ, జామ, బొప్పాయి పండించేవారు. తర్వాత కావ్య ఫామ్స్‌ పేరుతో వ్యవసాయ పరిశ్రమగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యాన పంటలపై దృష్టి పెట్టారు. బిందుసేద్యం చేస్తూ... ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. -లక్ష్మీ సుజాత, రైతు

సాగు వ్యవహారాన్ని ఈ అక్కాచెల్లెళ్లే చూసుకుంటారు. మార్కెటింగ్‌ సమస్య లేకుండా ప్రముఖ మాల్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతున్నారు. -విజయలక్ష్మి, రైతు

వీరి వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేవారు కూడా అందరూ మహిళలే. రోజుకు రెండు షిప్ట్‌ల్లో ఏడాది పొడవునా ఏదో ఒక పనితో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. దాదాపు 20 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.

ఇదీ చదవండి:krmb, grmb: 'బోర్డుల సమావేశం వాయిదా వేయలేం'.. మరి తెలంగాణ హాజరవుతుందా?

ABOUT THE AUTHOR

...view details