స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని... ప్రజలు శాంతియుతంగా మెలగాలని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సీఐ రాంబాబు అన్నారు. చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంలో పెద్దలు, మహిళలతో సమావేశం నిర్వహించారు. పిల్లలను అల్లర్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. గొడవలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని సీఐ రాంబాబు ప్రజలను హెచ్చరించారు.
"గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు" - ఇంకొల్లు సీఐ
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా... ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఇంకొల్లు సీఐ సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గొడవలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు