ప్రకాశం జిల్లా త్రిపురాంతాకం మండలంలో నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. సంఘంతండాలో 20 లీటర్ల నాటుసారాతో పాటు తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
త్రిపురాంతకం, బెస్తవారిపేట మండలాల్లో... నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు - ప్రకాశంలో భారీగా బెల్లంఊట ధ్వంసం చేసిన ఎస్ఈబీ
నాటుసారా తయారీ స్థావరాలపై.. ప్రకాశం జిల్లా ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. త్రిపురాంతకం మండలం సంఘంతండా, బెస్తవారిపేట మండలం పగుళ్లలో.. మొత్తం 4,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు
బెస్తవారిపేట మండలం పగుళ్ల అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ సిబ్బంది దాడి చేశారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సీఐ సోమయ్య, ఎస్సై మహబూబ్ వలితో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు.. 48 గొర్రెలు మృతి