ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు ఎవరూ తమతో మాట్లాడటం లేదని కన్నీరు పెట్టుకున్నారు. బడిలో ఆయా సైతం తమకు మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదంటూ ముగ్గురు చిన్నారులు వారి బాధను వ్యక్తం చేశారు. తమతో మాట్లాడినా, ఆడుకున్నా పది వేల రూపాయల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారని వాపోయారు. ఇదేం న్యాయం అంటూ విద్యార్థులు కోడూరి పుష్ప, గాయత్రి, హేమంత్ ప్రశ్నించారు. 'ఆధునిక రాజ్యంలో మానవీయ ఆంక్షలా?' అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ పిల్లలు వారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ లేఖ రాసింది నేనే..