ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శభాష్‌ ఇమ్మాన్యుయేల్‌

ఓ ఆర్టీసీ డ్రైవర్‌... ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనూ జాగ్రత్త వహించి ప్రయాణికులను కాపాడాడు. సురక్షిత ప్రదేశంలో బస్సు నిలిపి కన్నుమూశాడు.

By

Published : Jul 4, 2019, 7:38 AM IST

rtc-driver-save-passengers

శభాష్‌ ఇమ్మాన్యుయేల్‌

ప్రకాశంజిల్లాలో 34 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు పొదిలి బయల్దేరింది. కొంత దూరం వెళ్లేసరికి... డ్రైవర్ ఇమ్మాన్యుయేల్‌కు కాస్త నలతగా ఆనిపించింది. మెల్లిగా డ్రైవ్‌ చేస్తూ గమ్యం దిశగా సాగాడు. దొనకొండకు చేరుకునేసరికి నొప్పి ఎక్కువైంది. వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన ఆయన... బస్సును పక్కకు ఆపేశాడు. అలా ఆపేసిన మరుక్షణమే డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలిపోయాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details