ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-గుంటూరు హైవేపై గొర్రెల లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ట్రాక్టర్ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే మృతిచెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వాహనంలో ఉన్న 40 గొర్రెలు చనిపోయాయి. మృతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.
ఆటో,బొలెరో ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు...
అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షేర్ ఆటో, బొలెరో ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న ఓ వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.